ఇండియా గాలి ఎందుకు అంత చెడుగా, ప్రమాదకరంగా ఉంది?
ఇండియాలో గాలి బాగా చెడిపోయింది—శ్వాస తిస్కోవలి అంటేనే భయం వేస్తుంది. పోల్యుట్ గాలి వల్ల చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొందరు చనిపోతున్నారు కూడా. కానీ ఈ గాలి ఎందుకు ఇంత చెడిపోయింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో సులభంగా చూద్దాం.

Gen-Z వల్లు ఈ ప్రంపంచి మర్చగలరా
గాలి చేదిపోవతనికి కారణాలు
1. ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు
ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాలు గాలిలో చాలా పొగ, దుమ్ము వదులుతాయి.
ఇండియాలో గాలి చెడటంలో సగం కంటే ఎక్కువ ఇవే కారణం. ముఖ్యంగా ఢిల్లీ చుట్టూ ఇలాంటివి ఎక్కువ.
2. వాహనాలు
రోడ్ల మీద కార్లు, బైక్లు, ట్రక్కులు బాగా పెరిగాయి—32 కోట్లకు పైగా ఉన్నాయి.
ఇవి పొగ వదులుతాయి, గాలిని చెడగొడతాయి.
ఢిల్లీలో రోజూ 1,400 కొత్త వాహనాలు వస్తున్నాయి—అవి గాలిని ఇంకా దారుణం చేస్తున్నాయి.

3. పంటలు కాల్చడం
పంజాబ్, హర్యానాలో రైతులు పంటలు కోసిన తర్వాత మిగిలిన గడ్డిని కాల్చేస్తారు.
ఇది సులభం, చౌక కానీ గాలిలో బాగా పొగ పెడుతుంది. ఢిల్లీలో చలికాలంలో వచ్చే పొగమంచు దీని వల్లే ఎక్కువ.
4. ఇంట్లో వంట
చాలా మంది—సుమారు 60%—ఇప్పటికీ కట్టెలు, పిడకలతో వంట చేస్తారు.
ఇది ఇంట్లోనే కాదు, బయట గాలిని కూడా చెడగొడుతుంది. గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువ.
5. నిర్మాణాల దుమ్ము
రోడ్లు, ఇళ్లు, మెట్రోలు నిర్మాణం వల్ల దుమ్ము గాలిలోకి లేస్తుంది.
ఢిల్లీలో కొన్ని రోజులు ఈ దుమ్మే గాలిని ఎక్కువ చెడగొడుతుంది.
6. ప్రకృతి సహాయం చెయ్యకపోవడం
ఇండియా ఉత్తర భాగంలో పర్వతాలు, చల్లని గాలి వల్ల పొగ, దుమ్ము గాలిలోనే ఉండిపోతాయి.
ఢిల్లీలో గాలి నాణ్యత (AQI) 400, 900 దాటుతుంది—అది శ్వాస తీస్తే రోజుకు 25 సిగరెట్లు తాగినట్టు.

అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన తప్పేంటి
ఎందుకు ప్రమాదం?
ఈ చెడు గాలి వల్ల 2019లో 16 లక్షల మంది చనిపోయారు. ఇది ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, క్యాన్సర్ తెస్తుంది. చిన్న పిల్లలు—5 ఏళ్లలోపు—1 లక్షకు పైగా చనిపోయారు. ఢిల్లీ మాత్రమే కాదు, ముంబై, కోల్కతా, చిన్న ఊళ్లలో కూడా గాలి చెడుగా ఉంది.
ఇప్పుడు ఎందుకు ఇంకా దారుణం?
దేశంలో బాగా అభివ్రుది చెందుతుంది —ఫ్యాక్టరీలు, వాహనాలు, పెరిగాయి.
కానీ గాలిని శుభ్రం చెయ్యడం కష్టంగా ఉంది. ప్రభుత్వం NCAP అని ఒక ప్లాన్ పెట్టింది కానీ అది సరిగా పని చెయ్యట్లేదు.
చట్టాలు గట్టిగా లేవు, ప్రజలు కూడా పొగ ఎక్కువైతేనే గుర్తిస్తారు.
-
మాస్క్ లేనిది జీవితం లేదు
ఏం చెయ్యొచ్చు?
- మంచి ఇంధనం: ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి, డీజిల్ ఆపాలి.
- రైతులకు సాయం: పంటలు కాల్చకుండా తీసే యంత్రాలు ఇవ్వాలి.
- బస్సులు, ట్రైన్లు: పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చెయ్యాలి.
- గాలిని చెక్ చెయ్యడం: గాలి ఎలా ఉందో రోజూ చెప్పే సిస్టమ్ ఎక్కువ ఊళ్లలో పెట్టాలి.
చివరిగా
ఇండియా గాలి చెడటానికి మనం చేసే పనులే—ఫ్యాక్టరీలు, వాహనాలు, పంటలు కాల్చడం—కారణం.
ఇది ఒక్క ఢిల్లీ సమస్య కాదు, దేశం మొత్తం ఇబ్బంది. అందరూ చెడు గాలినే పీలుస్తున్నారు.
దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మరణాలు ఆగవు.
ఇప్పుడు చర్య తీసుకోకపోతే—ఊపిరి ఆడకుండా పోతుంది!